Jio 6G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 29 Aug 2023 08:39:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 Reliance AGM 2023: Jio 6G పై ప్రకటన చేసిన ముఖేశ్ అంబానీ https://www.91mobiles.com/telugu/reliance-agm-2023-mukesh-ambani-announcement-on-jio-6g-services/ Mon, 28 Aug 2023 12:27:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=7756 Jio True 5Gతో రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద 5G సర్వీస్ ప్రొవైడర్ టెలికాం కంపెనీగా అవతరించింది. 450 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో రిలయన్స్ జియో తన 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదిక నుండి ఈరోజు 6G నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. జియో 6G గురించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ భారతదేశంలో రాబోయే 6G సర్వీసెస్ కోసం తమ కంపెనీ ఇప్పటికే సిద్ధంగా ఉందని మరియు ప్రపంచంలో 6Gని ప్రారంభించిన మొదటి వాటిలో […]

The post Reliance AGM 2023: Jio 6G పై ప్రకటన చేసిన ముఖేశ్ అంబానీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • కొనసాగుతోన్న రిలయన్స్ ఏజీఎమ్ 2023
  • జియో 6జీ పై ప్రకటన చేసిన ముఖేశ్ అంబానీ
  • 6జీ కోసం ఫిన్‌లాండ్ కంపెనీతో భాగస్వామ్యం

Jio True 5Gతో రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద 5G సర్వీస్ ప్రొవైడర్ టెలికాం కంపెనీగా అవతరించింది. 450 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లతో రిలయన్స్ జియో తన 46వ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) వేదిక నుండి ఈరోజు 6G నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. జియో 6G గురించి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ భారతదేశంలో రాబోయే 6G సర్వీసెస్ కోసం తమ కంపెనీ ఇప్పటికే సిద్ధంగా ఉందని మరియు ప్రపంచంలో 6Gని ప్రారంభించిన మొదటి వాటిలో రిలయన్స్ జియో కూడా ఉంటుందని చెప్పారు.

మొదలైన Jio 6G ఏర్పాట్లు

రిలయన్స్ AGM వేదిక నుండి ముఖేష్ అంబానీ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 6G నెట్‌వర్క్‌ను నిర్మించే మొదటి కంపెనీలలో జియో ప్లాట్‌ఫామ్స్ పేరు కూడా చేర్చబడుతుందని అన్నారు. అంబానీ ప్రకారం, 2016 సంవత్సరంలో Jio 4G ప్రారంభించబడినప్పుడు, కంపెనీ ఇతర దేశాలు మరియు కంపెనీల సాంకేతికతపై ఆధారపడి ఉందన్నారు. కానీ ఇప్పుడు రిలయన్స్ జియో పూర్తిగా స్వయం సమృద్ధిగా మారిందని, అలాగే కంపెనీ యొక్క ప్రస్తుత జియో ట్రూ 5G నెట్‌వర్క్ 100 శాతం అంతర్గత సాంకేతికతతో నిర్మించబడిందని చెప్పారు.

ఈ సమయంలో ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ జియో ప్రకారం, చిన్న సెల్ నుండి పెద్ద టవర్ ఆధారిత రేడియో వరకు అన్ని స్పెక్ట్రమ్ దేశీయమైనదేనని తెలుస్తోంది. ఇది ఇండోర్ మరియు అవుట్‌డోర్ రెండింటిలోనూ అద్భుతమైన కనెక్టివిటీని అందించగలదు. Jio ఉపయోగిస్తున్న 5G సాంకేతికత మరియు దానిలో ఉపయోగిస్తున్న పరికరాలు కూడా Jio 6G అభివృద్ధికి సహాయపడతాయి. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ జియో అత్యధిక గ్లోబల్ పేటెంట్లను దాఖలు చేసిన భారతీయ కంపెనీగా కూడా అవతరించిందని తెలిపారు.

ఫిన్‌లాండ్ యూనివర్శిటీతో చేతులు కలిపిన Jio

6G టెక్నాలజీలో పరిశోధన కోసం జియో సంస్థ గత ఏడాది ఫిన్‌లాండ్‌లోని ఉలు యూనివర్సిటీతో చేతులు కలిపింది. రిలయన్స్ జియో మరియు యూనివర్శిటీ ఆఫ్ ఉలు మధ్య ఈ భాగస్వామ్యం తర్వాత, ఇరువురు 6G టెక్నాలజీ దిశగా సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్నారు. అలాగే 6G టెక్నాలజీ స్టాండర్డైజేషన్ కోసం కలిసి పనిచేస్తున్నారు. ఈ భాగస్వామ్యాన్ని రిలయన్స్ గ్రూప్ యూనిట్ అయిన జియో ఎస్టోనియా చేసింది.

The post Reliance AGM 2023: Jio 6G పై ప్రకటన చేసిన ముఖేశ్ అంబానీ first appeared on 91Mobiles Telugu.

]]>