4G ధరల కంటే ఎక్కువ ఉండనున్న 5G ప్లాన్ ధరలు

హైలైట్స్:

  • 5జీ సేవలు లాంచ్ అయ్యాక, తొలినాళ్ళలో 4జీ కంటే 5జీ ప్లాన్ ధరలు ఎక్కువగా ఉంటాయంటోన్న నిపుణులు
  • 10 నుంచి 12 శాతం ఎక్కువ ఉండనున్న 5జీ ప్లాన్ ధరలు
  • 5జీ సాంకేతికత మరింత విస్తృతమై, మెరుగయ్యాక 4జీ కి సమానంగా దిగి రానున్న 5జీ ధరలు

ఎయిర్టెల్, జియో లు తొలుత 5జీ డేటా ప్లాన్స్ కి ఎక్కువ మొత్తం వసూలు చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 4జీ ప్లాన్ ధరలతో పోలిస్తే, కొత్తతరం 5జీ నెట్వర్క్ ని మరింత ప్రియం కానుందని సమాచారం. తొలుత విధించబడే ఈ అత్యధిక ధరలు తదుపరి విడతతకు ఏఆర్ఫీయూ పెరుగుదలకు దోహదపడవచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం టెలీకామ్ కంపెనీలు రానున్న 5జీ స్పెక్ట్రమ్ వేలం లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ప్రభుత్వం మాటిచ్చినట్లుగానే, ఈ ఏడాది 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక అదానీ గ్రూప్ జియో, ఎయిర్టెల్, వీఐ లతో పోటీపడటాన్ని భారతీయ టెలీకామ్ వినియోగదారులు చూడవచ్చు.

4G ధరల కంటే అత్యధికంగా ఉండనున్న 5G ధరలు

5జీ సేవలు దేశ వ్యాప్తమయ్యాక, టారిఫ్ ప్లాన్స్ ఎలా ఉంటాయో పలు నివేదికలు, నిపుణుల ద్వారా స్పష్టమవుతోంది. తొలుత దేశంలో 5జీ ధరలు, 4జీ రేట్స్ కంటే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. 3జీ నుంచి 4జీ కి మరలినప్పుడు కూడా 4జీ ధరలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఇది ప్రతీ టెలీకామ్ వినియోగదారుడికి అనుభవమే. సరిగ్గా ఇప్పుడు అవే పరిస్థితులు ఉండబోతున్నాయని అంటున్నారు. 5జీ రాక తో 4జీ ప్లాన్ ధరల కంటే 5జీ ధరలు చాలా ఎక్కువగా ఉండనున్నాయి. ఇది తొలినాళ్ళలో అనివార్యమైన విషయం. హార్డ్ వేర్ అప్ గ్రేడేషన్ కోసం, స్పెక్ట్రమ్ కోసం టెలీకామ్ సంస్థలు భారీ ఎత్తున ఖర్చు చేస్తాయి కావున, తొలుత ధరలు ఎక్కువుండటం సహజమే.

4జీ తో పోల్చి చూస్తే, 5జీ ప్లాన్ ధరలు 10 నుంచి 12 శాతం అధికంగా ఉంటాయని ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ గ్రోత్ కి ఈ అధిక 5జీ ధరలు తొలినాళ్ళలో దోహదపడగలవని అంచనా. 4జీ కంటే పది రెట్లు వేగవంతమైన డేటా స్పీడ్ ను అందించగల 5జీ ఇంటర్నెట్ ను ప్రథమంగా అధిక ధరలు చెల్లించగలిగే, మిడ్ రేంజ్ నుంచి ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్స్ వాడుతోన్న యూజర్లను టార్గెట్ చేసేందుకు టెలీకామ్ సంస్థలు అస్త్రంగా వాడనున్నట్లు ఓ అనలిస్ట్ చెప్పారు.

4జీ తో అందించలేని సేవలను 5జీ ద్వారా అందించేందుకై తొలుత అధిక ధరల ప్లాన్స్ ద్వారా ప్రీమియమ్ రూపంలో వసూలు చేయనున్నారని, ద ఎకనమిక్ టైమ్స్ తో ఓ టాప్ ఎక్జిక్యూటివ్ తెలిపారు. తద్వారా ఒనగూరే అధిక లాభాలను, నెక్స్ట్ జనరేషన్ టెలీకమ్యూనికేషన్ ను బలోపేతం చేయడానికి అవసరమగు హార్డ్ వేర్ అప్ గ్రేడేషన్ కోసం కంపెనీలు వాడతాయని సదరు అధికారి తెలిపారు.

ఏదేమైనప్పటికీ, చాలా మంది అభిప్రాయం ప్రకారం, రానున్న రోజుల్లో భారత్ లో 4జీ రేట్స్ కి సమానంగా 5జీ ప్లాన్ ధరలు కూడా ఉంటాయని తెలుస్తోంది. జనాల్లో 5జీ వినియోగం పెరిగాక, ఇది జరగడం సాధ్యమేననుకోండి. మరి అప్పుడు 4జీ ప్లాన్ ధరలు ఏమైనా తగ్గుతాయేమో చూడాలి. అలా తగ్గితే కనుక, 4జీ వినియోగదారులకు కాస్త ఉపశమనం లభించే అవకాశముంది. ఎందుకంటే అందరూ 5జీ సేవలను పొందేందుకు పెద్ద మొత్తం డబ్బులను వెచ్చించలేరు కదా. కాబట్టి, టెలీకామ్ సంస్థలు, 5జీ సేవలు లాంచ్ అయ్యాక, 4జీ ప్లాన్ రేట్స్ ని తగ్గిస్తే, అది వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆమేరకు ట్రాయ్ కూడా టెలీకామ్ సంస్థలకు 4జీ ధరల విషయమై ఒక నిబంధనను పెడితే సామాన్యుడికి ఎంతో సాయం చేసినట్లే.

Previous articleలాంచ్ కి ముందు లీకైన Moto G32 డిజైన్ రెండర్స్
Next articleభారత్ లో లాంచ్ కానున్న BMW ప్రీమియమ్ ఎలక్ట్రిక్ స్కూటర్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.