Home News భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు

భారత్ లో 4G ధరల మాదిరే ఉండనున్న 5G సేవల ధరలు

హైలైట్స్:

వచ్చే నెలలో భారతదేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతోంది. వచ్చే నెల నుంచి 5జీ సేవలు ప్రారంభిస్తామని ప్రముఖ టెలీకామ్ కంపెనీలు ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. దీంతో దేశ ప్రజల్లో 5జీ రీచార్జ్ ప్లాన్ ధరలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తి మొదలైంది. 5జీ సేవలకు కూడా 4జీ మాదిరే వసూలు చేస్తారని సమాచారం.

ఎకనమిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ సంస్థలు 4జీ సేవలను అందిస్తున్న ధరలకే, 5జీ సేవలను అందించనున్నాయట. తొలి దశలో 5జీ సేవలను 4జీ సేవల ధరలోనే అందించడం వల్లన చాలామంది 5జీ నెట్వర్క్ కి మారేందుకు అవకాశాలు చాలా ఉంటాయని రిపోర్ట్ పేర్కొంది.

5జీ నెట్వర్క్ ని లాంచ్ చేసిన తొలినాళ్ళలో 5జీ సేవలకు టెలీకామ్ సంస్థలు ప్రీమియమ్ ప్రైస్ పెట్టే చాన్స్ లేదని తెలుస్తోంది. అనుకున్న యూజర్ బేస్ వచ్చాక, 5జీ సేవలకు ఎక్కువ ధరలను పెట్టాలని టెలీకామ్ కంపెనీలు భావిస్తున్నట్లు పలువురు ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇది అంత త్వరగా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే, జనాలందరి దగ్గర ఇంకా 5జీ ఫోన్లు లేవు. ఇప్పుడిప్పుడే 5జీ ఫోన్లను కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. 5జీ ఫోన్ల ధరలు కూడా తగ్గడం మొదలైంది. రూ.15,000 లోపు అందుబాటులో ఉన్న 5జీ ఫోన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రూ.10,000 ధర లోపైతే అసలు లేవు. కాబట్టి టెలీకామ్ సంస్థలు అప్పుడే 5జీ సేవలకు ఓ రేంజ్ లో వసూలు చేయరు.

భారత్ లో 5G ధరలు: నిపుణులు చెబుతున్నదేంటి?

“5జీ ఆపరేటర్లు 4జీ కంటే ఎక్కువ ధరలను వసూలు చేసే అవకాశం లేదు. వారి యొక్క సత్వర లక్ష్యం జనాలు 5జీ కి మారడం, ఎక్కువ మంది 5జీ కస్టమర్లను సంపాదించడం. జనాలు ఎంత ఎక్కువ డేటా వినియోగిస్తే అంత లాభం. ఏఆర్పీయూ వృద్ధి ముఖ్యం.” అని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ రోహన్ ధమిజా అన్నారు.

అలాగే ధమీజా యూకే ని ఉదాహరణగా చూపారు. తొలుత 5జీ సేవలను ప్రీమియమ్ ధరకు లాంచ్ చేశారు. వారి ఎత్తుగడ బెడిసి కొట్టడంతో, మళ్ళీ ఆ ఆలోచనను విరమించుకుని 4జీ ధరలకే 5జీ సేవలను అందించారని ధమీజా తెలిపారు.

5జీ సేవలకు ఎక్కువగా డబ్బులు డిమాండ్ చేస్తే, యూజర్లను పొందడం కంపెనీలకు కష్టంగా మారుతుంది. ప్రస్తుతం 5జీ యూస్ కేస్ సింగిల్ డిజిట్స్ కే పరిమితం కానుంది. అని బీఎన్పీ పరిబాస్ ఈక్వైట్ రీసెర్చ్ హెడ్ ఆఫ్ ఇండియా, కునాల్ వోరా అన్నారు.

4జీ ధరల మాదిరే 5జీ ధరలు ఉంటాయని గతంలో 91మొబైల్స్ తో ఎయిర్టెల్ సీటీవో రణదీప్ సెఖాన్ తెలిపారు.

అక్టోబర్ లో లాంచ్ కానున్న 5G సేవలు, కొన్ని ప్రాంతాలకే పరిమితం

తొలి దశలో 5జీ సేవలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కానున్నాయని ET రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ లో తమ 5జీ సేవలను లాంచ్ చేస్తామని ఎయిర్టెల్, జియో ప్రకటించాయి. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న వొడాఫోన్ ఐడియా ఇంకా 5జీ రోలౌట్ కి టైమ్ లైన్ నిర్దేశించుకోలేదు.

లేటెస్ట్ టెలీకామ్, స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.