హైలైట్స్:
- అక్టోబర్ 1 న భారత్ లో లాంచ్ అయిన 5జీ సేవలు
- 2022 చివరి కల్లా 75 శాతం ప్రధాన నగరాలకు విస్తరించనున్న 5జీ నెట్వర్క్
- 8 ముఖ్య నగరాల్లో తమ 5జీ సేవలు ప్రారంభమవుతాయని ప్రకటించిన ఎయిర్టెల్
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5జీ సేవలను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 1 నుంచి 5జీ రోలౌట్ భారత్ లో ప్రారంభమైంది. జియో, ఎయిర్టెల్ తొలుత దేశంలో 5జీ సేవలను ప్రారంభించనున్నాయి. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు లను కలుపుకుని మొత్తం 8 నగరాల్లో తమ 5జీ సేవలు మొదలవుతాయని ఎయిర్టెల్ ప్రకటించింది.
5G లభ్యత
5జీ రోలౌట్ అయిన నగరాల్లో కనుక మీరు ఉన్నట్లయితే సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే 5జీ సేవలను మీరు ఉపయోగించుకోలేక పోతే దానికి పలు కారణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. మీరు 5జీ టవర్ కి సమీపంలో ఉండటం ఎంతో అవసరం. లేకపోతే 5జీ సిగ్నల్ వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం 5జీ టవర్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయో తెలియదు. అంటే కచ్చితంగా మీ కార్యాలయానికి లేదా మీ ఇంటికి సమీపంలో 5జీ టవర్ ఉంటే మీరు సేవలను వాడుకోవచ్చు.
అయితే ఏమి, 2022 సంవత్సరం పూర్తయ్యే కల్లా భారత్ లోని 75 శాతం నగరాల్లో 5జీ సేవలు విస్తరిస్తాయని సమాచారం. 2023 డిసెంబర్ కల్లా గ్రామీణ ప్రాంతాలకు కూడా జియో 5జీ సేవలను తీసుకెళ్తామని ముకేశ్ అంబాని ప్రకటించడం జరిగింది. మరోవైపు, తొలిదశలో ఎయిర్టెల్ 5జీ సేవలు ఢిల్లీ, వారణాసి, బెంగళూరు, ముంబై లతో కలుపుకుని మొత్తం 8 నగరాల్లో అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఆమేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రకటన చేశారు. 2024 మార్చి కల్లా దేశం మొత్తం తమ 5జీ సేవలు విస్తరిస్తాయని మిత్తల్ తెలిపారు.
5జీ సిగ్నల్ రాకపోవడానికి మరో కారణమేంటంటే, మీ ఫోన్ తయారీదారు 5జీ సపోర్ట్ ని ఎనేబుల్ చేయకపోవడమే. మార్కెట్ లో లభిస్తున్న దాదాపు అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ 5జీ సపోర్ట్ డిసేబుల్ అయి ఉంటున్నాయి. అప్డేట్ ద్వారా 5జీ సపోర్ట్ ఎనేబుల్ అవుతుంది. మీరు అప్డేట్ కోసం వేచి చూడాలి. ఇప్పటికే రియల్మీ సంస్థ 5జీ సపోర్ట్ ని ఓటీఏ అప్డేట్ ద్వారా రోలౌట్ చేయడం మొదలు పెట్టింది.
5G సెట్టింగ్స్ ఎనేబుల్ చేయాలి
5జీ సేవలను వాడుకునేందుకు స్మార్ట్ ఫోన్స్ లో 5జీ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవాలని ఎయిర్టెల్ చెబుతోంది. కనెక్షన్స్ లేదా మొబైల్ నెట్వర్క్ ఆప్షన్స్ ద్వారా మీరు 5జీ సెట్టింగ్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. 4జీ లేదా ఎల్టీఈ తో పాటు 5జీ ఆప్షన్ ని మీరు ఎంచుకోవల్సి ఉంటుంది. దాదాపు అన్ని సిమ్ కార్డులు 5జీ ఎనేబుల్ అయి ఉన్నాయి. దీంతో మీ 5జీ స్మార్ట్ ఫోన్స్ పై సిమ్ కార్డ్స్ సాఫీగా పని చేస్తాయి.
5G ధరలు
4జీ మాదిరి, మీరు 5జీ సేవలను వాడుకోవాలంటే, 5జీ ప్లాన్ ని రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో ఎయిర్టెల్ 5జీ టారిఫ్స్ ని లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం ఉన్న 4జీ రేట్లకే 5జీ సేవలు లభిస్తాయని ఎయిర్టెల్ కు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనంత చౌకగా జియో 5జీ రేట్లు ఉంటాయని జియో సంస్థ ప్రకటించింది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












