టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన Adani కంపెనీ, Jio, Airtel ఆదిపత్యానికి తెరపడనుందా?

హైలైట్స్

  • టెలీకామ్ మార్కెట్ లోకి 6 ఏళ్ళ తర్వాత వస్తున్న కొత్త కంపెనీ
  • టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందిన అదాని కంపెనీ
  • మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ధరలు పడిపోనున్నాయా?

ప్రస్తుతం భారతీయ టెలీకామ్ మార్కెట్ లో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు టాప్-3 పొజిషన్ లో యాక్టివ్ గా సేవలు అందిస్తున్నాయి. రిలయన్స్ జియో అత్యధిక సబ్‌స్క్రైబర్లతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాత స్థానాల్లో వరుసగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఉన్నాయి.

భారత్ లో 5జీ సేవలు ప్రారంభమయ్యాక, జియో మరియు ఎయిర్టెల్ మధ్య పోటీ పెరిగింది. కానీ, చూస్తుంటే త్వరలోనే భారతీయ టెలీకామ్ మార్కెట్ లో మార్పు రానుందని తెలుస్తోంది. ఈ మూడు సంస్థలకు తోడు త్వరలోనే అదాని డేటా నెట్వర్క్ జత చేరనుందని సమాచారం. అదాని డేటా నెట్వర్క్స్ టెలీకామ్ సర్వీసెస్ లైసెన్స్ పొందినట్లు తెలుస్తోంది. దీంతో అదాని కంపెనీ కూడా టెలీకామ్ సేవలను అందించనుంది.

యూనిఫైడ్ లైసెన్స్ పొందిన Adani Data Networks

దేశ వ్యాప్తంగా టెలీకామ్ సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం నుంచి అదాని నెట్వర్క్స్ కి లైసెన్స్ జారీ అయినట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదాని డేటా నెట్వర్క్స్ కి యూనిఫైడ్ లైసెన్స్ ఇవ్వబడింది. దీంతో జియో, ఎయిర్టెల్ సంస్థల మాదిరి అదాని డేటా నెట్వర్క్స్ కూడా టెలీకామ్ సేవలను అందించనుంది. టెలీకామ్ మార్కెట్ లోకి అదాని ఎంట్రీ మార్కెట్ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుంది. ముకేశ్ అంబాని యొక్క జియో, సునీల్ భారతి మిట్టల్ యొక్క ఎయిర్టెల్ కు నష్టం తీవ్రస్థాయిలో ఉండటం ఖాయమని సమాచారం.

3 నెలల పాటు ఉచిత 5G సేవలు

ఎప్పుడైతే ముకేశ్ అంబాని రిలయన్స్ జియో ని మార్కెట్ లోకి లాంచ్ చేశారో అప్పుడు జియో 4జీ సేవలను కొన్ని నెలల పాటు ఉచితంగా అందించారు. ఉచితంగా 4జీ డేటా, 4జి సిమ్ లభిస్తుండటంతో, జనాలు జియో సిమ్ ని కొన్నారు. జియో స్టోర్ల వద్ద జనాలు క్యూ కట్టారు. అదాని నెట్వర్క్ సర్వీసెస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉండనుంది. జియో మాదిరి, అదాని 5జీ సేవలు కూడా కొన్ని నెలల పాటు ఉచితంగా ఇచ్చే అవకాశం ఉంది.

6 ఏళ్ళ తర్వాత వస్తున్న కొత్త కంపెనీ

భారత ప్రభుత్వం నడిపిస్తోన్న BSNL తో పాటు, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి మరో మూడు ప్రైవేటు టెలీకామ్ కంపెనీలు మాత్రమే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నాయి. వొడాఫోన్, ఐడియా సంస్థలు కలిసి వీఐ పేరుతో ఒకే సంస్థగా ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇకపోతే రిలయన్స్ జియో సంస్థ 2016 లో టెలీకామ్ మార్కెట్ లోకి ప్రవేశించింది. నేటితో రిలయన్స్ జియో వచ్చి 6 సంవత్సరాలు అవుతోంది. మరే ఇతర టెలీకామ్ సంస్థ కూడా ఈ ఆరేళ్ళలో మార్కెట్ లోకి రాలేదు. జనాలకు వేరే ఆప్షన్ లేకపోవడంతో, అన్ని టెలీకామ్ సంస్థల ప్లాన్స్ కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అదాని టెలీకామ్ కంపెనీ ఎంట్రీ మొబైల్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. అదాని టెలీకామ్ సర్వీసెస్ ఎంట్రీతో మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ ధరలు పడిపోయే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.