ఆగస్టులో 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేస్తాం – Airtel

హైలైట్స్:

  • ఈ నెలలో మొదలు కానున్న ఎయిర్టెల్ 5జీ సేవలు
  • ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో 5జీ నెట్వర్క్ డెప్లాయ్మెంట్ కై ఒప్పందం చేసుకున్న ఎయిర్టెల్
  • 5జీ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26GHz ఫ్రీకెన్సీల్లో మొత్తం 19867.8MHz స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేసిన ఎయిర్టెల్

5జీ స్పెక్ట్రమ్ మెగా వేలం ఇటీవలె పూర్తైంది. ఈ ఏడాది ముగిసే నాటికి 5జీ నెట్వర్క్ ని లాంచ్ చేయాలని టెలీకామ్ సంస్థలు భావిస్తున్నాయి. త్వరలోనే స్పెక్ట్రమ్ కేటాయింపులు, అప్రూవల్ పనులు జరిగిపోతాయని టెలీకామ్ మినిస్టర్ హామీనిచ్చారు. ఈలోపు తాము ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో 5జీ డెప్లాయ్మెంట్ కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. 5జీ సేవలు ఆగస్టు 2022 నుంచి ప్రారంభిస్తామని ఎయిర్టెల్ తెలిపింది. దీన్ని బట్టి, ఎయిర్టెల్ 5జీ రోలౌట్ ని చాలా త్వరగా అందిస్తుందని అంచనా వేయవచ్చు.

చాలా ఏళ్ళ నుంచి ఎరిక్సన్, నోకియాలతో ఎయిర్టెల్ కు అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్టెల్ నిర్ణయంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. అయితే శాంసంగ్ తో ఎయిర్టెల్ భాగస్వామ్యం ఈ ఏడాది నుంచే మొదలవుతుంది.

Ericsson, Nokia, Samsung లతో భాగస్వామ్యాన్ని ప్రకటించిన Airtel

2022 ఆగస్టులో 5జీ సేవలను ప్రారంభించేందుకు తాము ఎరిక్సన్, నోకియా, శాంసంగ్ లతో చేతులు కలుపుతున్నామని ఎయిర్టెల్ ప్రకటించింది.స్పెక్ట్రమ్ వేలం ముగిసిన కొన్ని రోజుల్లోనే ఎయిర్టెల్ ఈ ప్రకటనతో ముందుకొచ్చింది. 5జీ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26GHz ఫ్రీకెన్సీల్లో మొత్తం 19867.8MHz స్పెక్ట్రమ్ ని ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. మల్టీపుల్ పార్ట్నర్స్ ఉండటం వల్లన, అల్ట్రా-హై స్పీడ్స్, లో-లేటెన్సీ, లార్జ్ డేటా హ్యాండ్లింగ్ కేపబులిటీస్ విషయంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.

ఇది అద్భుతమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ ని అందిస్తుందని ఎయిర్టెల్ తెలిపింది. ఎంటర్‌ప్రైజ్ మరియు ఇండస్ట్రీ కస్టమర్లు కొత్త విధానాలను అనుభూతి చెందేందుకు దోహదపడుతుందని సదరు సంస్థ చెప్పింది. మల్టీ-ఇయర్ డీల్ లో నోకియా తన యొక్క మార్కెట్ లీడింగ్ ఎయిర్‌స్కేల్ పోర్ట్ ఫోలియో ద్వారా ఎక్విప్మెంట్ ను అందించడంతో పాటు, నెట్వర్క్ మేనేజ్మెంట్ పరిష్కారాలు, సేవలు, పంపిణీ, ప్రణాళిక, ఆప్టిమైజేషన్ వంటి సేవలను అందించనుంది.

మరోవైపు దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ అయిన శాంసంగ్, 5జీ నెట్వర్క్ ని డెప్లాయ్ చేయడంలో ఎయిర్టెల్ కి సాయం చేయనుంది. ఈ రెండు సంస్థలు కలిసి పని చేయడం ఇదే తొలిసారి. దేశ వ్యాప్తంగా 5జీ సేవలను త్వరగా అందించేందుకు ఎయిర్టెల్ కు ఇది కచ్చితంగా ఉపయోగపడనుంది.

“ఆగస్టులో 5జీ సేవలను ఎయిర్టెల్ రోలౌట్ చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మా నెట్వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. కస్తమర్లకు ఉత్తమమైన 5జీ నెట్వర్క్ ని అందించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ టెక్నాలజీ పార్ట్నర్స్ తో కలిసి పని చేస్తున్నాం. డిజిటల్ ఎకానమీ లోకి భారతదేశ ప్రయాణం టెలీకామ్ రంగం ద్వారా జరగనుంది. ఇండస్ట్రీలు, ఎంటర్‌ప్రైజెస్ డిజిటల్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేందుకు, భారత్ యొక్క సోషియో-ఎకానమిక్ డెవలప్మెంట్ కోసం 5జీ ఎంతగానో ఉపయోగపడనుంది. ” అని ఎయిర్టెల్ ఎండి, సీఈవో గోపాల్ విఠల్ చెప్పారు.

Previous articleOnePlus 10T లాంచ్: స్పెసిఫికేషన్స్, బ్యాంక్ ఆఫర్
Next articleగీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.