Home News బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel

బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల కోసం రూ.199 ప్రారంభ ధరతో చవకైన ప్లాన్లను తీసుకొచ్చిన Airtel

Highlights
  • ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం కొత్త ప్లాన్లను తెచ్చిన ఎయిర్టెల్
  • బ్రాండ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో వచ్చిన కొత్త ప్లాన్స్
  • కొత్త ప్లాన్ల ధరలు రూ.199 మరియు రూ.399

ఎయిర్టెల్ రెండు కొత్త ప్లాన్స్ ని తన బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ ధరలు రూ.199 మరియు రూ.399 గా ఉన్నాయి. ఎయిర్టెల్ ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్ల కోసం ఈ ప్లాన్స్ ని ఎయిర్టెల్ తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్స్ పేరుతో ఈ ప్లాన్స్ వచ్చాయి. ఈ ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాల వివరాలు తెలుసుకుందాం పదండి.

ఎయిర్టెల్ రూ.199 బ్రాడ్ బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.199 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటాతో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. అంతేకాదు, ఉచిత రూటర్ ని కూడా కంపెనీ అందిస్తోంది. మరి ఈ ప్లాన్ తీరుతెన్నులు, ఇతర చార్జీలు, ప్రయోజనాలు ఎలా ఉన్నాయో క్రింద వివరంగా ఇచ్చాం. ఓసారి చదివేయండి.

ఎయిర్టెల్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై

ఎయిర్టెల్ తీసుకొచ్చిన రూ.399 బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా యూజర్ కి అపరిమిత డేటా తో పాటు 10ఎంబీపీఎస్ స్పీడ్ లభిస్తుంది. ఇంకా ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలేంటో క్రింద అందిస్తున్నాం. ఓ కన్నేయండి.

రెండు ప్లాన్లలో కాలింగ్ ఉచితం

కంపెనీ అందించే డేటాతో పాటు, ఎక్స్‌ట్రిమ్ ఫైబర్ యూజర్లు బ్రాడ్‌బ్యాండ్ స్టాండ్‌బై ప్లాన్ ద్వారా అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాదు, ప్లాన్ లో అందుబాటులో ఉన్న ఇతర స్పీడ్స్ కి ఎప్పుడైనా అప్‌గ్రేడ్ అవ్వొచ్చు. అంటే మీ ప్లాన్ ని మీకు నచ్చినప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చన్నమాట. ఎయిర్టెల్ తీసుకొచ్చిన రెండు ప్లాన్ల ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటో తెలుసుకున్నారు కదా? మరొకసారి ప్లాన్ల ప్రయోజనాలను చదివి తెలుసుకుని, మీకు సరిపోయే ప్లాన్ ఏదో దానిని ప్రయత్నించండి.