Airtel: Jio బాటలో ఎయిర్టెల్, ప్లాన్స్ ధరలు పెంపు

టెలీకామ్ దిగ్గజం రిలయన్స్ JIO ఇటీవలె రీచార్జ్ ప్లాన్ల ధరల పెంపును ప్రకటించింది. ఆ వెనువెంటనే, మరొక దిగ్గజ టెలీకామ్ సంస్థ AIRTEL కూడా ధరల పెంపును అనౌన్స్ చేసింది. ఇకనుంచి ఈ రెండు బడా టెలీకామ్ కంపెనీల రీచార్జ్ ప్లాన్ల ధరలు భయపెట్టబోతున్నాయి. జులై 3 నుంచి పెరిగిన ఎయిర్టెల్ ప్లాన్ల ధరలు అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్ తన ప్లాన్స్ ధరలను 10 నుంచి 20 శాతం మేర పెంచింది. అయితే ప్లాన్స్ ద్వారా లభించే ప్రయోజనాల్లో మాత్రం ఏ మార్పు ఉండదు.

Airtel ప్రీపెయిడ్ ప్లాన్ల యొక్క కొత్త మరియు పాత ధరలు

Jio-Airtel తర్వాత, వీఐ కూడా రేట్లు పెంచనుందా?

టెలీకామ్ రంగ నిపుణుల ప్రకారం, జియో మరియు ఎయిర్టెల్ ధర పెంపును ప్రకటించాయి గనుక, తర్వాత వొడాఫోన్-ఐడియా కూడా టెలీకామ్ ట్యారిఫ్ పెంచుతుందని అంచనా. అయితే దీనికి సంబంధించి వీఐ నుంచి ఎటువంటి అధికార ప్రకటన ఇంకా వెలువడలేదు.

25 శాతం మేర ధరలు పెంచిన జియో

దేశంలోని ప్రముఖ టెలీకామ్ సంస్థ రిలయన్స్ జియో తమ రీచార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచింది. రీచార్జ్ ప్లాన్ల ధరలు 15 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని జియో ప్రకటించింది. జులై 3వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జియో తెలిపింది.

Previous articleOPPO Reno 12F 5G: డైమెన్సిటీ 6300 చిప్‌తో గ్లోబల్‌గా లాంచైన రెనో ఫోన్
Next articleVivo V40: బీఐఎస్ వెబ్‌సైట్‌పై లిస్టైన వివో వీ40
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.