Home How To Airtel యూజర్లకు ఉచిత 5జీ డేటా, ఇలా యాక్టివేట్ చేసుకోండి!

Airtel యూజర్లకు ఉచిత 5జీ డేటా, ఇలా యాక్టివేట్ చేసుకోండి!

Highlights
  • తన కస్టమర్లకు ఉచిత 5జీ డేటా ఇస్తోన్న ఎయిర్టెల్
  • ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు వర్తించనున్న ఆఫర్
  • దేశంలోని 270 నగరాల్లో అందుబాటులో ఉన్న ఎయిర్టెల్ 5జీ సేవలు

ఎయిర్టెల్ సంస్థ తన పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్ లో డేటా క్యాపింగ్ ని తొలగిస్తున్నట్లు ఎయిర్టెల్ అనౌన్స్ చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ఎయిర్టెల్ కస్టమర్లు ఉచితంగా అపరిమిత 5జీ డేటాను పొందవచ్చు. అయితే ఈ ఎయిర్టెల్ ఆఫర్ రూ.239 మరియు అంతకంటే పైన ఉన్న ప్లాన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ప్రస్తుతం ఎయిర్టెల్ 5జీ యూజర్లకు నెలవారీ ప్లాన్ పై ఎటువంటి డెయిలీ లిమిట్ లేదు.

ఎయిర్టెల్ ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ యూజర్లు అపరిమిత 5జీ డేటాను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియను ఇక్కడ వివరిస్తున్నాం. ఒకసారి చదివి తెలుసుకోండి.

ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ ని యాక్టివేట్ చేయడం ఎలా?

స్టెప్ 1: మీ యొక్క ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైస్ పై ఎయిర్టెల్ యాప్ ని తెరవండి.

స్టెప్ 2: మీరు గనుక యాప్ లో కాస్త స్క్రోల్ చేస్తే మీకు Claim Unlimited 5G Data (క్లెయిమ్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా) అని కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 3: క్లిక్ చేశాక మీకు కొత్త పేజీ కనిపిస్తుంది. అక్కడ మీకు రూ.0 ధరతో 5జీ డేటా అని ఉంటుంది.

స్టెప్ 4: క్రిందకు స్క్రోల్ చేస్తే మీకు క్లెయిమ్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

పైన చెప్పబడిన విధంగా మీరు ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ ని మీ ఫోన్ పై యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే, ప్రీపెయిడ్ యూజర్లు ఈ ఆఫర్ ని పొందాలంటే కనీసం రూ.239 ప్లాన్ ని లేదా అంతకంటే పైస్థాయి ప్లాన్ ని కలిగి ఉండాలి. దీంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్ 5జీ డివైజ్ అయ్యుండాలి. అంతేకాదు, మీ ప్రాంతంలో ఎయిర్టెల్ 5జీ నెట్వర్క్ కూడా ఉండాలి. అంటే మీ ప్రాంతంలో ఎయిర్టెల్ 4జీ సిగ్నల్ మాత్రమే వచ్చినట్లైతే మీరు ఈ 5జీ ప్లాన్ ని యాక్టివేట్ చేసుకోలేరు.

ఎయిర్టెల్ 5జీ సర్వీస్

భారతదేశంలోని 270 నగరాల్లో ఎయిర్టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు, రిలయన్స్ జియో 365 నగరాల్లో 5జీ నెట్వర్క్ ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 2023 పూర్తయ్యే నాటికల్లా దేశ వ్యాప్తంగా తన 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేస్తానని జియో తెలిపింది. మరోవైపు ఎయిర్టెల్ సంస్థ మార్చి 2024 కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను విస్తరింపజేస్తామని చెప్పింది.

ఎయిర్టెల్ 5జీ వేగం ఎంత?

మీ నంబర్ పై ఎయిర్టెల్ అన్‌లిమిటెడ్ 5జీ ఆఫర్ యాక్టివేట్ అయిన వెంటనే, మీకు ఒక మెసేజ్ ద్వారా సమాచారం తెలపబడుతుంది. మీరు 5జీ సర్వీస్ పై 30 రెట్లు వేగంగా ఇంటర్నెట్ వాడుకోగలుగాతరని ఈ సందేశంలో ఉంటుంది. అయితే 3జీ లేదా 4జీ కంటే 30 రెట్లు వేగమా.. అనేది ఎయిర్టెల్ తెలపలేదు. ప్రస్తుతం ఉన్న 4జీ సేవల కంటే కంపెనీ యొక్క 5జీ వేగం 30 రెట్లు ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోందని అంచనా వేస్తున్నారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెక్నాలజీ మరియు టెలీకమ్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.