
భారతదేశంలోని దిగ్గజ టెలీకామ్ కంపెనీ Jio తాజాగ ఒక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసింది. రూ.448 విలువ గల ఈ ప్లాన్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు యూజర్లకు లభించనున్నాయి. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు, ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలతో పాటు, 12 ఓటీటీ యాప్స్ కి సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఈ రీచార్జ్ ప్లాన్ను మై జియో యాప్ లేదా జియో అధికార వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. సరే, ఓసారి రూ.448 ప్లాన్ యొక్క పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.
జియో రూ.448 ప్లాన్ ప్రయోజనాలు
జియో తీసుకొచ్చిన రూ.448 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డెయిలీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లభిస్తాయి.
ఓటీటీ బెనిఫిట్గా జియోటీవీ ప్రీమియమ్ కస్టమర్లకు లభిస్తుంది. జియోటీవీ ప్రీమియమ్ పై కస్టమర్లకు 12 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ లభిస్తుంది.
సోనిలివ్, జీ5, జియోసినిమా ప్రీమియమ్, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ+, సన్నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠి, హొయ్చొయ్, చౌపల్ మరియు ఫ్యాన్కోడ్ వంటి ప్లాట్ఫామ్స్ కి యాక్సెస్ పొందవచ్చు. ఇంకా ఈ బండిల్ ప్లాన్ ద్వారా కస్టమర్లకు జియోక్లౌడ్ బెనిఫిట్ కూడా లభిస్తుంది.
గమనిక: జియో సినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రీచార్జ్ తర్వాత, మైజియో అకౌంట్ లో కూపన్ అందుబాటులో ఉంటుంది. ప్లాన్ వ్యాలిడిటీ వరకు మాత్రమే ఓటీటీ యాప్స్ కి యాక్సెస్ లభిస్తుంది. జియోసినిమా ప్రీమియమ్ సబ్స్క్రిప్షన్ను సెపరేట్గా రూ.29 కి జియో యాప్ లేదా వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

జియో రూ.448 ప్లాన్ రీచార్జ్ చేసుకోవచ్చా?
జియో విడుదల చేసిన రూ.448 ప్లాన్ మాత్రమే జియోటీవీ ప్రీమియమ్ తో వస్తోంది. జియో యూజర్లకు ఇతర ఎంటర్టెయిన్మెంట్ ఆప్షన్స్ ఉన్నప్పటికీ, జియోటీవీ ప్రీమియమ్ ద్వారా ఇతర ఓటీటీల మాదిరిగా చక్కటి కంటెంట్ లభిస్తుంది. కాబట్టి, కస్టమర్లు ఈ ప్లాన్ను రీచార్జ్ చేసుకోవచ్చు.











