Home News భారత్ లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ బేస్డ్ JioBook ల్యాప్‌టాప్: ధర, స్పెసిఫికేషన్స్

భారత్ లో లాంచ్ అయిన ఆండ్రాయిడ్ బేస్డ్ JioBook ల్యాప్‌టాప్: ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్

భారత్ లోని టాప్ టెలీకామ్ ఆపరేటర్లలో ఒకటైన Reliance Jio భారత్ లో JioBook బడ్జెట్ ల్యాప్‌టాప్ ని లాంచ్ చేసింది. జియో నుంచి వస్తోన్న తక్కువ ధర కలిగిన లార్జ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ఈ జియోబుక్. అయితే ఈ జియోబుక్ విండోస్ ల్యాప్ టాప్ కాదు. ఈ ల్యాప్ టాప్ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ పై పని చేస్తుంది.

తొలుత గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (GeM) వెబ్ సైట్ రూ.19,500 ధరతో జియోబుక్ ల్యాప్ టాప్ కనిపించింది. అయితే, ఇప్పుడు ఈ ల్యాప్ టాప్ ని మరింత తక్కువ ధరకు దేశ వ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంక్ కార్డ్స్ ద్వారా కస్టమర్లు ఈ జియోబుక్ ని తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మరి భారత్ లో జియోబుక్ ధర, మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో JioBook ధర, స్పెసిఫికేషన్స్

రిలయన్స్ జియో సంస్థ భారత్ లో సింగిల్ వేరియంట్ లో JioBook ల్యాప్ టాప్ ని లాంచ్ చేసింది. ఈ ఎంట్రీ-లెవెల్ ల్యాప్ టాప్ 2జిబి ర్యామ్, 32జిబి స్టోరేజీ తో లభ్యమవుతుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 128జిబి వరకు పెంచుకునే వీలుంది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదొక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ ఆధారిత ల్యాప్ టాప్. ఇందులో అప్లికేషన్స్, విండోస్ ల్యాప్ టాప్ మాదిరిగా భారీ సైజువి ఉండవు.

భారత్ లో JioBook ధరను రూ.15,799 గా నిర్ణయించారు. యాక్సిస్, కొటక్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్‌సీ, ఏయూ, ఇండస్ ఇండ్, డీబీఎస్, యస్ తదితర బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా JioBook ని కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

కొత్త ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, JioBook ల్యాప్ టాప్ 11.6-ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంది. 1366*768 పిక్సెల్స్ హెచ్డీ రెజుల్యూషన్, మందపాటి బెజెల్స్ తో ఈ ల్యాప్ టాప్ వస్తోంది.

2019 మరియు 2020 సంవత్సరాల్లో మనకు స్మార్ట్ ఫోన్స్ లో కనిపించిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని జియో తన JioBook లో వాడింది. అడ్రెనో 610 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం ఉపయోగించారు. ల్యాప్ టాప్ లో జనరేట్ అయ్యే హీట్ ని తగ్గించేందుకు ఇందులో ప్యాసివ్ కూలింగ్ మెకానిజమ్ ఉంది.

జియో ల్యాప్ టాప్ JioBook 32జిబి ఈఎంఎంసీ స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 128జిబి వరకు పెంచుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఈ బడ్జెట్ ల్యాప్ టాప్ ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 8 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

ఈ JioBook జియో కంపెనీ యొక్క JioOS పై పని చేస్తుంది. బడ్జెట్ డివైజెస్ పై స్మూత్ గా నడిచే విధంగా ఈ ఓఎస్ ని తీర్చిదిద్దారు. విండోస్ పై పని చేయనప్పటికీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ అప్లికేషన్ సపోర్ట్ ని అందిస్తోంది. ఇకపోతే ఈ JioBook లో జియో స్టోర్ ఉంటుంది. దీని ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని యూజర్లు డౌన్ లోడ్ చేసుకునే వీలుంది.

JioBook ల్యాప్ టాప్ 4జి సిమ్ కార్డ్ సపోర్ట్ కలిగి ఉంది. ఇందులో బ్లూటూత్ 5.0, వైఫై, హెచ్డీఎంఐ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. JioBook లో 2ఎంపి వెబ్ క్యామ్ అందించారు. ఈ ల్యాప్ టాప్ బరువు 1.2 కిలోలు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.