Home News లాంచ్‌కి ముందు లీకైన Redmi Pad SE రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర!

లాంచ్‌కి ముందు లీకైన Redmi Pad SE రెండర్స్, స్పెసిఫికేషన్స్, ధర!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Redmi Pad SE
  • 8ఎంపి రియర్, 5ఎంపి ఫ్రంట్ కెమెరాలతో వస్తోన్న డివైజ్
  • 8000 ఎంఏహెచ్ బ్యాటరీ Redmi Pad SE లో ఉండే అవకాశం

షావోమి సంస్థ భారతీయ మార్కెట్ తో పాటు, యూరప్ లో గతేడాది అక్టోబర్ నెలలో Redmi Pad ట్యాబ్లెట్ ని లాంచ్ చేసింది. భారత్ లో రూ.14,999 ధరతో Redmi Pad లాంచ్ అయ్యింది. Redmi Pad లో 10.61-ఇంచ్ డిస్ప్లే, ఆక్టా-కోర్ హీలియో జీ99 చిప్, 8ఎంపి రియర్ కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 8000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఇప్పుడు రెడ్మీ బ్రాండ్ తన రెండో ట్యాబ్లెట్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Redmi Pad SE అనే పేరుతో ఈ ట్యాబ్లెట్ మార్కెట్ లోకి రానుంది. Appuals ద్వారా రెండర్స్, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

లీకైన Redmi Pad SE స్పెసిఫికేషన్స్

లీకైన రెండర్స్ ద్వారా Redmi Pad SE గ్రే, పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభించనుందని తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్ మందపాటి బెజెల్స్ ని కలిగి ఉంది. ఇంకా వాల్యూమ్ బటన్స్ డివైజ్ కి కుడివైపున ఉన్నాయి. అలాగే ట్యాబ్లెట్ కి బాటమ్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

Redmi Pad SE ధర

Redmi Pad SE ట్యాబ్లెట్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర 190 యూరోలు (సుమారు రూ.17,294) గా ఉంటుంది. ఇది యురోపియన్ మార్కెట్ ధర. భారత్ లో లాంచ్ అనంతరం ఈ ట్యాబ్లెట్ ధర రివీల్ కానుంది. ఇక భారత మార్కెట్ లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రెడ్మీ కంపెనీ నుంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే 4జిబి ర్యామ్ వేరియంట్ కాకుండా, మరేదైనా వేరియంట్ ని రెడ్మీ సంస్థ తీసుకొస్తుందో లేదో ఇంకా తెలియదు. రానున్న రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.