హైలైట్స్
- 2022 నవంబర్ నెలలో అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి 5జీ ఓటీఏ అప్డేట్ వెళ్తుందని ప్రకటించిన Samsung కంపెనీ
- ఎయిర్టెల్ 5జీ ప్లస్ కంపాటిబులిటీ కలిగిన 9 శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్
- లేటెస్ట్ అప్డేట్ తో శాంసంగ్ డివైజెస్ లో ఎనేబుల్ కానున్న 5జీ సేవలు
2022 నవంబర్ కల్లా అన్ని 5జీ స్మార్ట్ ఫోన్స్ కి ఓటీఏ ద్వారా అప్డేట్ వెళ్తుందని శాంసంగ్ బుధవారం నాడు ప్రకటించింది. దీంతో త్వరలోనే శాంసంగ్ ఫోన్ యూజర్లు 5జీ సేవలను పొందనున్నారు. శాంసంగ్ బ్రాండ్ కి చెందిన ఎన్నో 5జీ డివైజెస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేవలం 9 హ్యాండ్సెట్స్ మాత్రమే ఎయిర్టెల్ 5జీ ప్లస్ కంపాటిబులిటీ కలిగి ఉన్నాయి.
Samsung Galaxy Z Flip 4, Samsung Galaxy Z Fold 4, Samsung Galaxy S22 Ultra, Samsung Galaxy S22, Samsung Galaxy S22+, Samsung Galaxy S21 FE, Samsung Galaxy A53 5G, Samsung Galaxy A33 5G యూజర్లు ఎయిర్టెల్ 5జీ ప్రయోజనం పొందనున్నారు.
భారత్ లో 5G సేవలు
భారతీయ టెలీకామ్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా రీసెంట్ గా భారత్ లో 5జీ సేవలను ప్రకటించాయి. ఇప్పటికే 5జీ రోలౌట్ మొదలైంది. కొన్ని నగరాల్లో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే 5జీ హ్యాండ్సెట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, 5జీ నెట్వర్క్ ఉన్న నగరాల్లో యూజర్లు 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. దీనికి కారణం, కొన్ని స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సంబంధిత ఫోన్లలో 5జీ సేవలను ఎనేబుల్ చేయకపోవడమే. అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ తో ఈ సమస్యను ఫిక్స్ చేయబోతున్నారు.
ఇక ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలు ప్రస్తుతం భారత్ లోని 8 నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. అవి: హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, సిలిగురి, నాగ్పూర్, వారణాసి. ఎయిర్టెల్ 4జీ తో పోల్చితే, ఎయిర్టెల్ 5జీ 30 రెట్లు అధిక స్పీడ్స్ ని అందిస్తుంది. మరోవైపు, జియో ట్రూ 5జీ సర్వీస్ ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి నగరాల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ కల్లా దేశ వ్యాప్తంగా 5జీ సేవలను లాంచ్ చేస్తామని జియో, ఎయిర్టెల్, వీఐ హామీ ఇచ్చాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.
5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












