ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ Samsung ఇటీవలె లాంచ్ చేసిన Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను తగ్గించింది. అంతేకాదు, గత మోడల్స్ Galaxy A54, A34, A15 ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. ధరలు తగ్గడంతో పాటు, బ్యాంక్ డిస్కౌంట్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో కొత్తగా శాంసంగ్ ఫోన్లను కొనాలనుకునే వారికి ఏ-సిరీస్ ఫోన్లు సరైన ఎంపిక అవ్వవచ్చు. ఓసారి తగ్గిన ధరల వివరాలు తెలుసుకుందాం పదండి.
Samsung Galaxy A15 5G ధర
Samsung Galaxy A15 మూడు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీటిపై రూ.1500 తగ్గింపుని కంపెనీ ప్రకటించింది.
తగ్గింపు తర్వాత, 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,499 గా ఉంది. దీని అసలు ధర రూ.17,999 గా ఉంది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ అసలు ధర రూ.19,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత దీని ధర రూ.17,999 కి చేరింది.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధర రూ.22,499 కాగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.20,999 కే లభించనుంది.
Samsung Galaxy A34 5G ధర తగ్గింపు
Samsung Galaxy A34 స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధరను శాంసంగ్ రూ.3,000 తగ్గించింది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.27,499 గా ఉండగా, ప్రస్తుతం రూ.24,499 కే లభించనుంది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు రూ.29,499 కాగా, కొత్త ధర రూ.26,499 గా ఉంది.
Samsung Galaxy A54 5G ధర తగ్గింపు
Samsung Galaxy A54 డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇదివరకు రూ.35,499 గా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ కొత్త ధర రూ.31,499 గా ఉంది.
8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇంతకు ముందు 37,499 గా ఉండగా, ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.33,499 కే లభిస్తోంది.
Samsung Galaxy A55 5G, Galaxy A35 5G ఫోన్ల ధర తగ్గింపు
శాంసంగ్ సంస్థ Galaxy A55, Galaxy A35 ఫోన్ల ధరలను రూ.3,000 తగ్గించింది. ఈ రెండు ఫోన్లు కూడా రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యాయి.
Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.30,999 గా ఉండగా, ప్రస్తుతం తగ్గింపు తర్వాత రూ.27,999 కే లభిస్తోంది.
Samsung Galaxy A35 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.33,999 గా ఉండేది. ఇప్పుడు కొత్త ధర రూ.30,999 గా ఉంది.
Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర ఇంతకు ముందు రూ.39,999 గా ఉండేది. ఇప్పుడు దీని కొత్త ధర రూ.36,999 గా ఉంది.
Samsung Galaxy A55 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర ఇదివరకు రూ.42,999 గా ఉండేది. ఇప్పుడు తగ్గింపు తర్వాత రూ.39,999 గా ఉంది.
ఈ ఫోన్లపై ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అలాగే, ఎక్స్చేంజ్ ఆఫర్ లో భాగంగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ లేదా రిటైల్ ఔట్లెట్స్ ద్వారా అదనపు బోనస్ పొందవచ్చు.
