Union Budget 2024: తగ్గనున్న మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు

Highlights

  • శుభవార్త తెచ్చిన కేంద్ర బడ్జెట్ 2024
  • ఫోన్లు, చార్జర్స్ పై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు
  • దిగిరానున్న స్మార్ట్‌ఫోన్లు, చార్జర్ల ధరలు

భారత ప్రభుత్వం తాజాగా 2024 బడ్జెట్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా Mobile phone యూజర్లకు శుభవార్త వచ్చింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ 2024 ప్రజెంటేషన్ లో మొబైల్ ఫోన్లు, చార్జర్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతంకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్లు, చార్జర్ల ధరలు తగ్గనున్నాయి. ఈ మార్పు ఇటు కస్టమర్లకు, అంటు కంపెనీలకు లాభాన్ని చేకూర్చనుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

యూనియన్ బడ్జెట్ 2024: తగ్గనున్న ఫోన్లు, చార్జర్ల ధరలు

కస్టమ్ డ్యూటీ అనేది స్మార్ట్‌ఫోన్లు, చార్జర్లను కస్టమర్లకు మరియు కంపెనీలకు మరింత ప్రియం చేస్తోందని, అందువల్లనే తమ ట్యారిఫ్ పాలసీని మార్చుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇందులో భాగంగా, 2024 బడ్జెట్ లో, కేంద్ర ప్రభుత్వం ఇంపోర్టెడ్ ఫోన్లు, ఫోన్ చార్జర్లపై గతంలో ఉన్న 20 శాతం కస్టమ్ డ్యూటీని 15 శాతానికి మారుస్తున్నట్లు తెలిపారు.

ఫోన్లు, చార్జర్లపై తక్కువ కస్టమ్ డ్యూటీ వల్లన కలిగే ఆర్థిక లాభాలు

తక్కువ పన్నుల మూలంగా, ఫోన్లు, ఫోన్ చార్జర్లు తక్కువ ధరకే వినియోగదారులకు లభిస్తాయి.

అలాగే దీని వల్లన విదేశీ తయారీదారులను ఆకర్షించడంతో పాటు, స్వదేశీ ఫోన్లు, చార్జర్ల తయారీదారులకు లబ్ధి చేకూర్చినట్లువుతుంది.

తక్కువ ధరల వల్లన, కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ డిమాండ్ వల్లన కంపెనీలు తమ ఉత్పత్తి రేటుని పెంచి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి లాభపడతాయి.

తక్కువ కస్టమ్స్ డ్యూటీ వల్లన స్వదేశీ మరియు విదేశీ తయారీదారులకు ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుంది. దీని వల్లన పోటీ పెరగడంతో పాటు, ఉపాధి సృష్టి కూడా జరుగుతుంది.

Source