30 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డెయిలీ డేటాతో చవకైన రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన BSNL

హైలైట్స్

  • రూ.199 విలువజేసే కొత్త పాకెట్ ఫ్రెండ్లీ రీచార్జ్ ప్లాన్ ని లాంచ్ చేసిన BSNL
  • ప్లాన్ ప్రయోజనాలు: 30 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డెయిలీ డేటా, అపరిమిత కాలింగ్, డెయిలీ 100 ఎస్ఎంఎస్
  • కొత్త కస్టమర్లతో పాటు ఎంఎన్‌పి కస్టమర్లకు వర్తించనున్న ఆఫర్

చవకైన మొబైల్ రీచార్జ్ ప్లాన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే టెలీకామ్ కంపెనీ BSNL. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే బోలెడన్ని రీచార్జ్ ప్లాన్స్ BSNL వద్ద ఉన్నాయి. ఈ ప్రభుత్వరంగ సంస్థ తన రీచార్జ్ ప్లాన్స్ తో ప్రయివేట్ టెలీకామ్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. త్వరలో 4జీ, 5జీ సేవలను లాంచ్ చేయబోతున్న BSNL తన సబ్‌స్క్రైబర్ లను మరింత పెంచుకోవడం ఖాయమనిపిస్తోంది.

తాజాగా BSNL ఒక చవకైన రీచార్జ్ ప్లాన్ ని తీసుకొచ్చింది. రూ.199 విలువజేసే ఈ ప్లాన్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ ద్వారా వచ్చిన కస్టమర్లు మరియు కొత్త కస్టమర్లకు వర్తిస్తుంది. ఇప్పుడు రూ.199 రీచార్జ్ ప్లాన్ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

BSNL రూ.199 రీచార్జ్ ప్లాన్ బెనిఫిట్స్

BSNL రూ.199 విలువగల పాకెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ని తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ని రీచార్జ్ చేస్తే 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా ప్రతిరోజు 2జిబి డేటా లభిస్తుంది. 30 రోజుల పాటు డెయిలీ 2 జిబి డేటా అంటే మొత్తంగా 60జిబి డేటా పొందవచ్చు. ఇంకా యూజర్ కి ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే అపరిమిత కాలింగ్ సౌకర్యం కూడా ఈ రీచార్జ్ ప్లాన్ తో పొందవచ్చు.

BSNL 4G లాంచ్ తేదీ

చాలా రోజులుగా BSNL 4జీ లాంచ్ కి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు BSNL 4జీ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని కస్టమర్లు వేచి చూస్తున్నారు. ఇటీవలె ఓ యూజర్ కి రిప్లే ఇస్తూ 4జీ లాంచ్ టైమ్ లైన్ ని కూడా BSNL ప్రకటించింది. 2023 ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో BSNL 4జీ సేవలు లాంచ్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది.

BSNL 5G గురించి కూడా చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇంకా బీఎస్ఎన్ఎల్ 4జీ లాంచ్ కాలేదు. మరి 5జీ సంగతేంటని సబ్‌స్క్రైబర్లతో పాటు సాధారణ జనం చర్చించుకుంటున్నారు. అయితే 4జీ లాంచ్ తర్వాత BSNL 5G కూడా లాంచ్ అవుతుందని సమాచారం. టెలీకామ్ మినిస్టర్ కూడా BSNL 5G వచ్చే ఏడాది ఆగస్టు 15 న లాంచ్ అవుతుందని ప్రకటించారు. మరోవైపు 5జీ ధరలు ఎక్కువగా ఉండబోవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ప్రయివేట్ టెలీకామ్ సంస్థలు జియో, ఎయిర్టెల్ దేశంలో తమ 5జీ సేవలను ఇప్పటికే ప్రారంభించాయి. అయితే తొలిదశలో కొన్ని నగరాలకే ఈ సేవలు పరిమితమయ్యాయి. త్వరలోనే అన్ని ప్రాంతాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం 5జీ హవా నడుస్తోంది. 5జీ సేవలు, 5జీ ఫోన్లు అంటూ ఎక్కడ చూసినా ఇదే హడావుడి కనిపిస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.