
2013 లో Honor సంస్థ హువావే కి సబ్-బ్రాండ్ గా చైనాలో ప్రవేశించింది. 2014 లో భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన హానర్ తక్కువ సమయంలోనే యూజర్లలో బాగా పాపులర్ అయ్యింది. ఆ సంస్థ పరిచయం చేసిన వాల్యూ-ఫర్-మనీ డివైజెస్ ఇందుకు కారణం. అయితే హానర్ కంపెనీ 2020 లో భారతీయ మార్కెట్ లో తన స్మార్ట్ఫోన్ బిజినెస్ కి గుడ్ బై చెప్పింది. అదే సమయంలో హానర్ Honor 9X Pro, Honor 9S, Honor 9A వంటి ఫోన్లను లాంచ్ చేసింది.
అయితే భారత మార్కెట్ నుంచి హానర్ పూర్తిగా వైదొలగలేదు. ఫిట్నెస్ ట్రాకర్స్, ట్యాబ్లెట్స్ వంటి డివైజెస్ ని లాంచ్ చేస్తూ వస్తోంది. తాజా నివేదిక ద్వారా హానర్ తిరిగి భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించనున్నట్లు తెలిసింది. అలాగే తన తొలి ఫోన్ ని భారత్ లో ఆగస్టు నెలలో లాంచ్ చేయనుందని సమాచారం.

గత నెలలో వచ్చిన నివేదిక ప్రకారం, రియల్మీ మాజీ సీఈవో, మాధవ్ సేత్ భారత్ లో హానర్ బ్రాండ్ ని నడిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ టిప్స్టర్ ముకుల్ శర్మ ఒక ఇమేజ్ ని షేర్ చేశారు. దాన్ని క్రింద చూడవచ్చు. ఇమేజ్ లో Honor for Knights అనే ట్రేడ్మార్క్ కనిపిస్తోంది.
లిస్టింగ్ లోని డిస్క్రిప్షన్ ని బట్టి, ఇది మొబైల్ ఫోన్స్, యాక్ససరీలతో అసోసియేట్ అయినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మాధవ్ సేత్ ని ప్రొప్రైటర్ గా పేర్కొనబడింది. మరోవైపు, మాధవ్ సేత్ తన ట్వీట్ లో ఒక ప్రశ్నను సంధించారు. “వెన్ ఈజ్ ద నైట్ కమింగ్?” అని ఆ ప్రశ్న ఉంది. దీంతో ఇది హానర్ నుంచి రానున్న కొత్త ఫోన్ గురించేనని ఫాలోవర్లు అభిప్రాయపడుతున్నారు.
టిప్స్టర్ శర్మ ప్రకారం, హానర్ భారతీయ మార్కెట్ లోకి ఆగస్టులో ఒక కొత్త ఫోన్ తో రీఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అయితే స్పెసిఫిక్ మోడల్ గురించి బ్రాండ్ నుంచి ఏ సమాచారం బయటకు రాలేదు.











