OPPO F27 Pro+ 5G: వచ్చే వారం భారత్‌లో లాంచ్ అవుతోన్న ఒప్పో కొత్త ఫోన్

Highlights

  • OPPO F27 Pro+ 5G లాంచ్ తేదీ ఖరారు
  • జూన్ 13న భారత్ లో డివైజ్ లాంచ్
  • ఐపీ69 రేటింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO ఎఫ్-సిరీస్‌లో ఒక కొత్త ఫోన్‌ని భారత్‌లో లాంచ్ చేయనుంది. OPPO F27 Pro+ 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఈ రేటింగ్ తో రానున్న మొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఉంటుందని సదరు బ్రాండ్ కన్ఫర్మ్ చేసింది. తాజాగా ఈ ఫోన్ లాంచ్ తేదీ ఖరారైంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO F27 Pro+ 5G ఇండియా లాంచ్ తేదీ

OPPO F27 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ 13వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని ఒప్పో సంస్థ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ మిడ్నైట్ నేవీ మరియు డస్క్ పింక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 3డీ కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ ఉంటుంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.6GHz.

కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 64ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమరా ఉంటుంది.

బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.