హైలైట్స్:
- ఓటీటీ సైట్స్ లో సినిమాల విడుదలపై నిర్మాతల కఠిన నిర్ణయం
- సినిమా థియెట్రికల్ రిలీజ్ తర్వాత రిజల్ట్ ని బట్టి, డిజిటల్ రైట్స్ ధర నిర్ణయించాలనే ప్రతిపాదనను నిర్మాతల ముందు పెట్టిన ఓటీటీ సంస్థలు
- ఓటీటీ సంస్థల ప్రతిపాదన పట్ల సుముఖంగా లేని నిర్మాతల మండలి
కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల మండలి ప్రస్తుతం కొనసాగుతోన్న సినిమాల చిత్రీకరణను ఆపేయాలని నిర్ణయించింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కొట్టేందుకు బడ్జెట్ ను తగ్గించుకోవాలని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. బడ్జెట్ ను తగ్గించాలంటే, స్టార్ హీరోలు మరియు దర్శకుల రెమ్యునరేషన్ ను తగ్గించాల్సిందేనని తెలుగు చిత్ర నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దిల్ రాజు అన్నారు.
అయితే రీసెంట్ గా స్ట్రైక్ విరమణకు పిలుపునిచ్చిన నిర్మాతల మండలి, కొన్ని ఆదేశాలను జారీ చేసింది. “థియెట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ లో సినిమా విడుదలను 8 వారాలకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై అందరు నిర్మాతలు కూడా ఈ నిబంధనకు కట్టుబడి ఉండాలి. నిబంధనను అతిక్రమించడానికి అస్సలు వీలులేదు. ప్రస్తుతం ఉన్న ఒప్పందాలను కొనసాగిస్తున్నాం. ఒకవేళ అవసరమైతే, నియమ నిబంధనలను వెంటనే మార్చుతాం,” అని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు.
అయితే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మాత్రం నిర్మాతల మండలి డిక్లరేషన్ పై పాజిటివ్ గా లేదు. దీంతో వారు మరొక ప్రత్యామ్నాయ ప్రతిపాదనను నిర్మాతల మండలి ముందు ఉంచారు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెబుతున్నదేంటో ఇక్కడ చూద్దాం. ముందు నిర్మాతలు థియెట్రికల్ రిలీజ్ కి వెళ్ళాక, సినిమా ఫలితాన్ని బట్టి ఫైనల్ డిజిటల్ రేట్ ను సర్దుబాటు చేసుకుందామని ఓటీటీ సైట్స్ చెబుతున్నాయి. అయితే ఈ ప్లాన్ పట్ల నిర్మాతల మండలి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. చివరకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
దిల్ రాజు నిర్ణయంపై హ్యాపీగా లేని స్టార్ హీరోలు, డైరెక్టర్లు
కథానాయకులు, దర్శకుల రెమ్యునరేషన్ ను తగ్గించాలని దిల్ రాజు తీసుకున్న నిర్ణయం పట్ల వారు సానుకూలంగా లేరు. వారు తమ పారితోషికాన్ని తగ్గించుకునే స్థితిలో లేరు. వేరే సినిమాలు ఓటమి పాలైతే, దానికి తామెందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తమ సినిమాలు బాగా ఆడుతున్నాయని, తాము తమ యొక్క బ్రాండ్ మరియు కంటెంట్ తో ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టగలమని స్టార్ హీరోలు, దర్శకులు చెబుతున్నారు.
ఇటీవల బొక్క బోర్లాపడ్డ సినిమాలు
రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన సినిమా థాంక్యూ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. మరో సినిమా ఎఫ్3 అనుకున్న రేంజ్ లో ఆడలేదు. షాహిద్ కపూర్ ని హీరోగా పెట్టి జెర్సీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు దిల్ రాజు. అయితే ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో దిల్ రాజు భారీ నష్టాలను చవి చూశారు. మరోవైపు, షూటింగ్స్ ఆపడం వల్లన చిత్రసీమ మరింత కష్టాల్లోకి వెళ్తుందని, దిల్ రాజు టీమ్ నిర్ణయాన్ని మరో నిర్మాతల వర్గం తప్పుబడుతోంది.
దిల్ రాజు పై బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన నిర్మాతలు
నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న దిల్ రాజు ఇతర నిర్మాతలతో చర్చించి తీసుకున్న నిర్ణయం సీనియర్ నిర్మాత అయిన అశ్వినీ దత్, మరో నిర్మాత బండ్ల గణేశ్ కు ఎందుకో నచ్చలేదు. దీంతో బాహాటంగానే దిల్ రాజు పై సదరు నిర్మాతలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తన సినిమాల చిత్రీకరణను ఆపేది లేదని అశ్వినీ దత్ వెల్లడించారు. దిల్ రాజు నిబంధనలు తమ సినిమాలకు వర్తించవని, తమ సినిమాల షూటింగ్స్ ని కొనసాగిస్తామని అశ్వినీ దత్ అన్నారు.
లేటెస్ట్ ఓటీటీ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.












