Govt Of India - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 07 Feb 2023 11:51:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 ఈ-శ్రమ్ కార్డ్ (e-Shram card) ప్రయోజనాలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? https://www.91mobiles.com/telugu/how-to-apply-e-shram-card-online-and-benefits/ Tue, 07 Feb 2023 11:51:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=4818 భారతదేశం యొక్క పురోగతిలో కార్మికుల యొక్క కృషి గణనీయమైనది. అనేక పథకాలు మరియు ప్రాజెక్టులను సాకారం చేయడంలో కార్మిక సోదరుల సహకారాన్ని తక్కువ అంచనా వేయలేము. అటువంటి కార్మికులు మరియు కూలీలకు సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో, ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందించే ఈ-శ్రమ్ కార్డును ప్రారంభించింది. ఈ ఇ-శ్రమ్ కార్డ్ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మరియు దీన్ని ఎలా ఉచితంగా పొందాలి? తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ-శ్రమ్ కార్డ్ యొక్క ప్రయోజనాలు ముఖ్యంగా […]

The post ఈ-శ్రమ్ కార్డ్ (e-Shram card) ప్రయోజనాలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత ప్రభుత్వం కార్మికులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ కార్డు
  • ఈ-శ్రమ్ కార్డు ద్వారా కార్మికులకు ఎన్నో ప్రయోజనాలు
  • ఈ-శ్రమ్ కార్డ్ తో బీమా యోజన సౌకర్యం, ఉపాధి వంటి ఎన్నో లాభాలు

భారతదేశం యొక్క పురోగతిలో కార్మికుల యొక్క కృషి గణనీయమైనది. అనేక పథకాలు మరియు ప్రాజెక్టులను సాకారం చేయడంలో కార్మిక సోదరుల సహకారాన్ని తక్కువ అంచనా వేయలేము. అటువంటి కార్మికులు మరియు కూలీలకు సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యంతో, ప్రభుత్వం అనేక ప్రయోజనాలను అందించే ఈ-శ్రమ్ కార్డును ప్రారంభించింది. ఈ ఇ-శ్రమ్ కార్డ్ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి మరియు దీన్ని ఎలా ఉచితంగా పొందాలి? తదితర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈ-శ్రమ్ కార్డ్ యొక్క ప్రయోజనాలు

ముఖ్యంగా వేతనాలపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం ఈ-శ్రమ్ కార్డ్ ప్రారంభించబడింది. ఈ పథకం కింద కార్మికులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ. 2 లక్షల వరకు బీమా కవరేజీ అందుతుంది. అంటే, ప్రమాదంలో కార్మికుడు మరణిస్తే రూ.2 లక్షలు, అంగవైకల్యం కలిగితే రూ.లక్ష వరకు సాయం లభిస్తుంది. ఇది మాత్రమే కాదు, ప్రభుత్వం ఈ-శ్రమ్ కార్డ్ హోల్డర్ల బ్యాంక్ ఖాతాకు ఎప్పటికప్పుడు కొంత మొత్తాన్ని బదిలీ చేస్తుంది. మరియు 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలవారీ రూ.3000 వరకు పెన్షన్ లభిస్తుంది.

ఇ-లేబర్ కార్డ్ ఉన్న కూలీలకు ప్రభుత్వం ఉపాధిని కల్పిస్తుంది. అలాగే అనేక పథకాలలో కూడా ప్రాధాన్యత ఇస్తుంది. కార్మికులు మరియు హాకర్లు, రిక్షా పుల్లర్లు, బార్బర్‌లు, వాషర్‌మెన్, టైలర్లు, చెప్పులు కొట్టేవారు, క్లీనర్లు, గార్డ్‌లు, ట్రైలర్‌లు, డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు, దుకాణదారులు, పండ్లు, కూరగాయలు మరియు పాలు అమ్మేవారు అలాగే నర్సింగ్ సేవల్లో ఉన్న వ్యక్తులు ఈ-లేబర్ కార్డ్ ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ-శ్రమ్ కార్డ్‌ కి ఇలా దరఖాస్తు చేయండి

  • ఈ-శ్రమ్ కార్డ్‌ని రూపొందించడానికి ముందుగా eshram.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి. (ఇక్కడ క్లిక్ చేయండి)
  • కార్మిక శాఖ వెబ్‌సైట్ హోమ్ పేజీలో ఈ-శ్రమ్ ఎంపికపై నమోదు కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
  • ఇక్కడ స్వీయ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీని కోసం మీరు ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

  • నంబర్ ఇచ్చిన తర్వాత, ఆ ఫోన్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని వెబ్‌సైట్‌లో సమర్పించాలి. OTP ధృవీకరించబడిన తర్వాత మీ సభ్యత్వం నమోదవుతుంది.
  • రిజిస్టర్ పేజీకి వచ్చిన తర్వాత, అభ్యర్థించిన సమాచారాన్ని సరిగ్గా పూరించండి. ఇందులో పేరు, చిరునామా, పని, బ్యాంక్ ఖాతా మొదలైనవి ఉంటాయి.
  • అన్ని వివరాలను పూరించిన తర్వాత సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి. మీ E-Shram కార్డ్ ఉత్పత్తి చేయబడుతుంది, దీనిలో మీరు 12 అంకెల UAN అంటే యూనివర్సల్ ఖాతా నంబర్‌ను పొందుతారు.

ఇ-శ్రామ్ కార్డ్ కోసం ప్రభుత్వం ఎటువంటి రుసుము వసూలు చేయదని మరియు ఇది పూర్తిగా ఉచితమని గమనించండి. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇంటర్నెట్ సెంటర్ లేదా మరెక్కడికైనా వెళ్లాల్సిన అవసరం లేదు. పైన పేర్కొన్న దశలను అనుసరించడం ద్వారా మీరు స్వయంగా మొబైల్ ద్వారా ఇంట్లోనే శ్రామిక్ కార్డ్‌ని తయారు చేసుకోవచ్చు మరియు ఫోన్‌లో కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post ఈ-శ్రమ్ కార్డ్ (e-Shram card) ప్రయోజనాలేంటి? ఎలా దరఖాస్తు చేయాలి? first appeared on 91Mobiles Telugu.

]]>
E-Commerce వెబ్‌సైట్స్ లో కనిపించే ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోన్న భారత ప్రభుత్వం https://www.91mobiles.com/telugu/govt-of-india-bringing-new-guidelines-against-fake-reviews-on-e-commerce-platforms/ Tue, 22 Nov 2022 14:11:24 +0000 https://www.91mobiles.com/telugu/?p=3593 హైలైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూల సమస్య ఫేక్ రివ్యూలతో నష్టపోతున్న వినియోగదారులు ఫేక్ రివ్యూలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తోన్న భారత ప్రభుత్వం ఇక మీదట ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూలకు అవకాశం ఉండదు. ఎన్నో ఉత్పత్తులపై ఈ -కామర్స్ సైట్స్ లో ఫేక్ రివ్యూలు తరచూ మనకు దర్శనమిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా […]

The post E-Commerce వెబ్‌సైట్స్ లో కనిపించే ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోన్న భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూల సమస్య
  • ఫేక్ రివ్యూలతో నష్టపోతున్న వినియోగదారులు
  • ఫేక్ రివ్యూలకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తోన్న భారత ప్రభుత్వం
Representative image.

ఇక మీదట ఫ్లిప్ కార్ట్, అమెజాన్ మరియు ఇతర ఈ-కామర్స్ వెబ్ సైట్స్ లో ఫేక్ రివ్యూలకు అవకాశం ఉండదు. ఎన్నో ఉత్పత్తులపై ఈ -కామర్స్ సైట్స్ లో ఫేక్ రివ్యూలు తరచూ మనకు దర్శనమిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా సదరు ప్రొడక్టుకి లేదా సంస్థకి లేదా వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే కొందరు కొనుగోలుదారులు ఇటువంటి ఫేక్ రివ్యూలు చదివి వాటికి బలవుతుంటారు. ఇకపై ఈ ఫేక్ రివ్యూల సమస్య లేకుండా భారత ప్రభుత్వం ఒక ఫ్రేం వర్క్ ని సిద్ధం చేసింది.

భారత ప్రభుత్వం ఇప్పటికే తన ఫ్రేం వర్క్ ని కన్జూమర్ రివ్యూలపై ఆధారపడి ప్రొడక్ట్స్ మరియు సేవలను వ్యాలిడేట్ చేసే సంస్థలకు పంపించింది. వీటిలో గూగుల్, మెటా, ఇన్‌స్టాగ్రామ్, అమెజాన్, ట్రావెల్ వెబ్‌సైట్స్ మరియు ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి.

ఫేక్ రివ్యూలకు సంబంధించి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ కి కొత్త మార్గనిర్ధేశకాలు

భారత ప్రభుత్వం ఫేక్ రివ్యూలపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తన కొత్త మార్గ నిర్దేశకాలను ఈ-కామర్స్ సంస్థలకు పంపించింది. దీని ద్వారా ఆన్‌లైన్ ఇంటరాక్షన్స్ మరియు ఈ-కామర్స్ ని మరింత పాదర్శకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో భవిష్యత్తులో కస్టమర్లు తప్పుదోవ పట్టే అవకాశాలు తగ్గనున్నాయి.

రైటర్స్ కథనం ప్రకారం, ఈ-కామర్స్ సైట్స్ లో తప్పుడు మరియు మోసపూరిత రివ్యూలను గుర్తించేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ ని అభివృద్ధి పరచాలని డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ జూన్ లో ఒక కమిటీని నియమించినట్లు సమాచారం.

ఫేక్ రివ్యూలకు అవకాశం కల్పిస్తున్నందుకు ఇటు వినియోగదారుల నుంచి అటు ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ నుంచి ఈ-కామర్స్ సైట్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కస్టమర్లకు ఉత్పత్తిని ఎంచుకునే క్రమంలో ఫేక్ రివ్యూలు అడ్డంకిగా పరిణమిస్తున్నాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కొత్త గైడ్‌లైన్స్ అనేవి కన్జూమర్లతో పాటు బ్రాండ్స్ కి మరింత పారదర్శకతతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తాయని LocalCircles ఫౌండర్ సచిన్ టపారియా తెలిపారు.

Meta మరియు Google సంస్థలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని రిపోర్ట్ లో పేర్కొనబడింది. ఈ సంస్థలు 6-8 మెకానిజమ్స్ ద్వారా రివ్యూ ఇచ్చే అసలైన వ్యక్తి ఎవరనేది వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పనిగట్టుకుని తప్పుడు రివ్యూలు రాసే అకౌంట్స్ కి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. అయితే ప్రభుత్వం రూపొందించిన పూర్తి డ్రాఫ్ట్ ప్రపోజల్ ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post E-Commerce వెబ్‌సైట్స్ లో కనిపించే ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోన్న భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
One Nation, One Charger: ఇకపై అన్ని గ్యాడ్జెట్స్ కి USB Type-C ఉండేలా చట్టం తీసుకురానున్న భారత్ https://www.91mobiles.com/telugu/india-one-nation-one-charger-policy-usb-type-c/ Sun, 20 Nov 2022 04:35:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=3545 హైలైట్స్ USB Type-C ని అన్ని స్మార్ట్ డివైజెస్ కి ప్రామాణిక చార్జింగ్ పోర్ట్ గా వాడాలని ప్లాన్ చేస్తున్న భారత్ అన్ని స్మార్ట్ ఫోన్స్ కి ఒకే విధమైన చార్జర్, ఫీచర్ ఫోన్స్ కి మరొక చార్జర్ – అంటే కేవలం రెండు చార్జర్ లను పరిగణలోకి తీసుకునే దిశగా పడుతోన్న అడుగులు ఫోన్ మారిన ప్రతీసారి చార్జర్ మార్చాల్సిన అవసరం లేకుండా యూజర్లకు ఉపయోగపడనున్న యూనివర్శల్ చార్జర్ లు ఎన్నో దేశాలు వన్ నేషన్, […]

The post One Nation, One Charger: ఇకపై అన్ని గ్యాడ్జెట్స్ కి USB Type-C ఉండేలా చట్టం తీసుకురానున్న భారత్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • USB Type-C ని అన్ని స్మార్ట్ డివైజెస్ కి ప్రామాణిక చార్జింగ్ పోర్ట్ గా వాడాలని ప్లాన్ చేస్తున్న భారత్
  • అన్ని స్మార్ట్ ఫోన్స్ కి ఒకే విధమైన చార్జర్, ఫీచర్ ఫోన్స్ కి మరొక చార్జర్ – అంటే కేవలం రెండు చార్జర్ లను పరిగణలోకి తీసుకునే దిశగా పడుతోన్న అడుగులు
  • ఫోన్ మారిన ప్రతీసారి చార్జర్ మార్చాల్సిన అవసరం లేకుండా యూజర్లకు ఉపయోగపడనున్న యూనివర్శల్ చార్జర్ లు

ఎన్నో దేశాలు వన్ నేషన్, వన్ చార్జర్ పాలసీని అమలు చేసే దిశగా అడుగు వేస్తున్నాయి. దీని ప్రకారం, అన్ని స్మార్ట్ డివైజెస్.. అంటే మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, కెమెరాలకు ఒకే రకమైన చార్జర్ ఉండనుంది. స్మార్ట్ ఫోన్స్ ని చార్జ్ చేసేందుకు USB Type-C ని స్టాండర్డ్ పోర్ట్ గా వినియోగించాలని భారత్ ప్లాన్ చేస్తోంది.

ఇంటర్-మినిస్ట్రియల్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో అన్ని స్మార్ట్ డివైజెస్ కి USB Type-C చార్జింగ్ పోర్ట్ ని వాడేందుకు అందరు స్టేక్‌హోల్డర్స్ అంగీకరించినట్లు కన్జూమర్ అఫైర్స్ కేంద్ర సెక్రటరీ రోహిత్ కుమార్ వెల్లడించారు.

ఫీచర్ ఫోన్లకు ఒక రకమైన చార్జర్, స్మార్ట్ ఫోన్లకు మరొకమైన చార్జర్ ఉంటే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. యురోపియన్ యూనియన్ ఇటీవలె చేసి చట్టానికి ఇది విభిన్నం. అన్నింటికీ టైప్-సీ ఉండేలా ఈయూ చట్టం తెచ్చింది. పైపైన మాటలే తప్పితే, ఫీచర్ ఫోన్లకు సంబంధించిన చార్జర్స్ గురించి ఇంకా ఏ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు. స్మార్ట్ వాచెస్, ఇయర్ బడ్స్ విషయంలో కూడా ఏ చార్జింగ్ పోర్ట్ ఉండాలనే దానిపై ఓ ప్రత్యేక బృందం చర్చిస్తోంది.

ప్రస్తుతం ఒక ఆపిల్ తప్పితే మిగతా అన్ని ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కూడా
యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ తోనే వస్తున్నాయి. యురోపియన్ కొత్త చట్టం తీసుకురావడంతో, ఆపిల్ తన తదుపరి లైనప్ ఐఫోన్ 15 సిరీస్ ని యూఎస్బీ టైప్-సీ తో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

USB Type-C చార్జర్ ప్రయోజనాలు

USB Type-C కనెక్షన్ ద్వారా డివైజెస్ సాధారణ యూఎస్బీ కంటే త్వరగా చార్జ్ అవుతయాయి. ల్యాప్ టాప్స్, ట్యాబ్స్ తదితర డివైజెస్ ని చార్జ్ చేసేందుకు టైప్-సీ ఉపయోగపడుతుంది. 100 వాట్స్ వరకు పవర్ సప్లై చేసే ఫాస్ట్ చార్జింగ్ ప్రోటోకాల్ USB Power Delivery కి యూఎస్బీ టైప్ సీ కనెక్షన్స్ సపోర్ట్ చేస్తాయి.

భారత్ లో E-Waste ని తగ్గించేందుకు సాయపడనున్న USB Type-C చార్జర్స్

వినియోగదారులు ఎల్లప్పుడూ ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ని మారుస్తుండటం వల్లన దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. అసోచామ్-ఈవై రిపోర్ట్ ప్రకారం, గతేడాది భారత్ లో 5 మిలియన్ టన్నుల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో యూఎస్, చైనా తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. అందుచేత, యూనివర్శల్ చార్జర్స్ ఉంటే కొత్త డివైజ్ కొన్న ప్రతిసారి కస్టమర్లు డిఫరెంట్ చార్జర్ ని కొనాల్సిన అవసరం ఉండదు. దీంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించినట్లవుతుంది.

2024 ద్వితీయార్థం ఆరంభమయ్యే నాటికల్లా యురోపియన్ యూనియన్ (ఐరోపా దేశాలు) లో అమ్ముడయ్యే ఏ స్మార్ట్ ఫోన్ అయినా, (ఆపిల్ ఐఫోన్ తో సహా) వైర్డ్ చార్జింగ్ కోసం కచ్చితంగా యూనివర్శల్ USB-C కనెక్టర్ ని కలిగి ఉండాలని ఈ ఏడాది జూన్ 7 న యురోపియన్ యూనియన్ ఒక ప్రిలిమినరీ చట్టాన్ని తీసుకొచ్చింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

The post One Nation, One Charger: ఇకపై అన్ని గ్యాడ్జెట్స్ కి USB Type-C ఉండేలా చట్టం తీసుకురానున్న భారత్ first appeared on 91Mobiles Telugu.

]]>
5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం https://www.91mobiles.com/telugu/indian-govt-asks-apple-samsung-to-release-5g-updates-immediately/ Wed, 12 Oct 2022 05:30:08 +0000 https://www.91mobiles.com/telugu/?p=2869 హైలైట్స్ 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్ భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, […]

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్

  • 5జీ సపోర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ని రోలౌట్ చేయాలని స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తెస్తోన్న కేంద్ర ప్రభుత్వం
  • ఇంకా భారత్ లో 5జీ సపోర్ట్ అప్డేట్స్ ని రోలౌట్ చేయని ఆపిల్, శాంసంగ్ సంస్థలు
  • భారత్ లో ఐఫోన్లపై 5జీ సపోర్ట్ ని పరీక్షిస్తోన్న ఆపిల్

భారత్ లో ఇంకా ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లు 5జీ సపోర్ట్ పొందాల్సి ఉంది. అక్టోబర్ 1 నుంచి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ, ఈ రెండు కంపెనీల 5జీ డివైజెస్ కి 5జీ సపోర్ట్ అప్డేట్స్ రాలేదు. ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ కంపెనీలపై ఒత్తిడి పెంచుతోంది. త్వరగా దేశంలో ఉన్న 5జీ కంపాటిబుల్ డివైజెస్ కి 5జీ అప్డేట్స్ విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్ లకు తెలిపింది.

5జీ సేవలు దేశంలో లాంచ్ అవ్వగానే, పలు ప్రాంతాల్లో 5జీ నెట్వర్క్ ని ప్రారంభిస్తామని ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థలు తెలిపాయి. సంబంధిత నగరాల్లో 5జీ సేవలు మొదలైనా, యూజర్లు మాత్రం తమ స్మార్ట్ ఫోన్లపై 5జీ సేవలను వినియోగించుకోలేక పోతున్నారు. ఎందుకంటే, వారికి 5జీ సపోర్ట్ కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇంకా రోలౌట్ కాలేదు. మీ వద్ద 5జీ ఫోన్ ఉన్నప్పటికీ, ఫోన్ తయారీదారు నుంచి వచ్చే ఓటీఏ అప్డేట్ ద్వారా మాత్రమే 5జీ కనెక్టివిటీ ఎనేబుల్ అవుతుంది.

లేటెస్ట్ గా రిలీజ్ అయిన iPhone 14 లో కూడా లేని 5జీ

ఐఫోన్ 12 నుంచి ఐఫోన్ 14 సిరీస్ వరకు ఆపిల్ సంస్థ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ని పంపించాలని, ఎయిర్టెల్ వెబ్ సైట్ లో కనిపిస్తోంది. ఐఫోన్స్ కి 5జీ అప్డేట్స్ ఇచ్చేందుకు ఆపిల్ సంస్థ చాలా సమయం తీసుకుంటోందని రైటర్స్ తో ఓ అధికారి అన్నారు. మరోవైపు శాంసంగ్ కూడా ఎన్నో స్మార్ట్ ఫోన్స్ కి ఇంకా 5జీ రోలౌట్ పంపలేదు. ఇదిలా ఉంటే, చైనా కంపెనీలైన షావోమీ, వివో లకు చెందిన 36 కి పైగా ఫోన్లకు 5జీ అప్డేట్స్ వచ్చాయి. ఆ ఫోన్లు ఎయిర్టెల్ 5జీ సేవలను వాడుకునేందుకు రెడీ అయ్యాయి.

ఈ నేపథ్యంలో భారతీయ టెలీకామ్, ఐటీ విభాగాలకు చెందిన అధికారులు బుధవారం నాడు సమావేశమై, 5జీ అడాప్షన్ ని త్వరగా పూర్తయ్యే విషయమై చర్చలు చేయనున్నారని రైటర్స్ తన కథనంలో పేర్కొంది. రిపోర్ట్ ప్రకారం, ప్రభుత్వం ఆపిల్, శాంసంగ్, వివో, షావోమీ సంస్థల నుంచి ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో భాగం కానున్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 1 న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను లాంచ్ చేశారు. అదే రోజున ప్రముఖ టెలీకామ్ సంస్థ ఎయిర్టెల్ కూడా 5జీ సేవలను లాంచ్ చేసింది. తర్వాత కొన్ని రోజులకు రిలయన్స్ జియో 5జీ సర్వీసెస్ లాంచ్ చేసింది.

The post 5G అప్డేట్స్ రిలీజ్ చేయాలని Apple, Samsung లను ఆదేశించిన భారత ప్రభుత్వం first appeared on 91Mobiles Telugu.

]]>
రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ https://www.91mobiles.com/telugu/govt-of-india-clarity-on-chinese-smarphones-under-12k-ban/ Fri, 02 Sep 2022 05:42:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=2057 హైలైట్స్: రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె […]

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>
హైలైట్స్:

  • రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదని ప్రకటించిన భారత ప్రభుత్వం
  • భారత కంపెనీల పాత్ర కీలకమైనప్పటికీ, అందుకోసం విదేశీ బ్రాండ్లను తొలగించాల్సిన అవసరం లేదన్న కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి
  • ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై ఇటీవల చోటుచేసుకున్న సోదాల నేపథ్యంలో సదరు కంపెనీలపై జాగ్రత్తగా గమనిస్తోన్న భారత ప్రభుత్వం

రూ.12000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్‌ ఫోన్లను త్వరలో భారత ప్రభుత్వం బ్యాన్ చేయనున్నట్లు ఇటీవలె వార్తలు వచ్చాయి. ఈ సెగ్మెంట్ లో మంచి రాబడినే రాబడుతోన్న వివో, ఒప్పో, షావోమీ లపై ప్రభుత్వ నిర్ణయం సంకటంగా మారనుందని అంతా భావించారు. అయితే, భారత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. రూ.12,000 లోపు ధర కలిగిన ఫోన్లను బ్యాన్ చేసే ఉద్దేశ్యం తమకు లేదని చెప్పింది. దీంతో చైనాకు చెందిన బ్రాండ్స్ కి ఉపశమనం లభించినట్లైంది.

కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తాజాగా వస్తోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. దేశం యొక్క ఎలక్ట్రానిక్ ఎకో సిస్టెమ్ కి భారతీయ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయన్నది వాస్తవమే కానీ, దానర్థం విదేశీ బ్రాండ్లను తొలగించి భారత కంపెనీలకు బాటలు వేయడం కాదని రాజీవ్ స్పష్టం చేశారు.

భారత్ లో రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లు రద్దు కావు

భారత్ లో అమ్ముడవుతోన్న రూ.12,000 లోపు ధర గల చైనా బ్రాండ్స్ ఫోన్ల బ్యాన్ పై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. “మేము లేవనెత్తిన ఇష్యూ విషయంలో ఎంతో పారదర్శకతతో వ్యవహరించాం. అదే విషయాన్ని చైనీస్ బ్రాండ్స్ కి స్పష్టం చేశాం. చైనా బ్రాండ్ల నుంచి మేం ఆశించేది ఏంటంటే వారు మరింత ఎగుమతులు పెంచుతారని. వారి సప్లై చైన్, ప్రత్యేకించి కంపోనెంట్స్ చైన్, ఎంతో పారదర్శకతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది,” అని చంద్రశేఖర్ అన్నారు.

రూ.12,000 సెగ్మెంట్ ఫోన్స్ విషయమై క్లారిటీ ఇస్తూ, “మా వద్ద అటువంటి ప్రపోజల్ లేదు. ఈ వార్త ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.” రూ.12,000 లోపు ధర కలిగిన చైనా స్మార్ట్ ఫోన్స్ ని భారత్ బ్యాన్ చేయనుందని బ్లూంబర్గ్ ఓ కథనం వెలువరించాక ఈ రభస మొదలైంది. బ్యాన్ ద్వారా లావా, జియో, మైక్రోమ్యాక్స్ తదితర దేశీయ బ్రాండ్లకు ఊతమివ్వాలని భారత్ భావిస్తోందని బ్లూంబర్గ్ తన కథనంలో తెలిపింది. ఇక భారత్ లో రూ.12,000 సెగ్మెంట్ లో చైనీస్ బ్రాండ్స్ ఆదిపత్యం కొనసాగుతోన్న విషయం గమనించాలి.

ఫోన్స్ ని బ్యాన్ చేయడం లేదు కానీ, భారత ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఓ కన్నేసి ఉంటోంది. ఒప్పో, వివో, షావోమీ కంపెనీలపై రైడ్స్ జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వీటి కదలికలను నిశితంగా గమనిస్తోంది. ఇప్పటికే ట్యాక్స్ ఎగవేతకు సంబంధించి పలు బ్రాండ్స్ పై ఈడీ కేసులు పెట్టింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ కంపెనీల దిగుమతులు, ఎగుమతులు, ఇతర లావాదేవీలపై ఫోకస్ పెట్టింది. చైనాకు చెందిన యాప్స్ విషయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. 2020 లో 50 చైనీస్ యాప్స్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ యాప్స్ టిక్ టాక్, పీయూబీజీ ఉన్నాయి.

The post రూ.12,000 లోపు ధర గల చైనా ఫోన్లను బ్యాన్ చేయడం లేదు – ఐటీ మినిస్టర్ first appeared on 91Mobiles Telugu.

]]>