భారత మార్కెట్ నుంచి తప్పుకోవడంపై స్పందించిన HONOR

హైలైట్స్:

  • భారత్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసిన హానర్ ప్రతినిధి
  • జియోపొలిటికల్ కారణాలతో హానర్ భారత్ ని వీడనుందని తెలిపిన గత నివేదికలు
  • భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ లో స్థిరమైన డిమాండ్ లేమితో మొదలైన హానర్ వివాదం

హువావే యొక్క ఒకప్పటి సబ్ బ్రాండ్ అయిన చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హానర్, తాజాగా భారతీయ మార్కెట్ నుంచి తప్పుకోవడం పై స్పందించింది. తాము భారత మార్కెట్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసింది. చైనీస్ మీడియా ఔట్ లెట్ ఐటీ హోమ్ తన కథనంలో, హానర్ సీఈవో జావో మింగ్ తాము భారత మార్కెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినట్లు పేర్కొనడంతో ఈ వివాదం మొదలైంది. అయితే భారత్ లో హానర్ వ్యాపారం బాగానే సాగుతోంది. సదరు కంపెనీకి నష్టాలు కూడా ఏమీ లేవు. అయితే గత కొంత కాలంగా హానర్ నుంచి భారత మార్కెట్ కి స్మార్ట్ ఫోన్ ఏదీ రాలేదు. కానీ, చివరగా ఓ స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేసింది.

Honor వివరణ, భారత మార్కెట్ స్తబ్ధత

తాజా నివేదికలపై స్పందించిన హానర్ ప్రతినిధి, “హానర్ భారత్ లో వ్యాపార లావాదేవీలను కొనసాగిస్తూ, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంది. హానర్ ఇండియన్ మార్కెట్ నుంచి తప్పుకుంటోందన్న వార్తలు నిజం కాదు,” అని అన్నారు.

మరింత పకడ్బందీ వ్యూహంతో భారత్ లో వ్యాపారం చేసేందుకు మార్గాలను అన్వేషిస్తామని, హానర్ తెలిపినట్లు ఐటీ హోమ్ తన కథనంలో పేర్కొంది. అయితే హానర్ స్టేట్మెంట్ ని చూస్తే, భారత్, చైనా మధ్య నెలకొన్న జియోపొలిటికల్ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత ప్రభుత్వం గత కొన్నాళ్ళుగా ఎన్నో మొబైల్ యాప్స్ పై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అందులో హువావే కు చెందినవి కూడా ఉన్నాయి. గతంలో హువావే, హానర్ యొక్క పేరెంట్ కంపెనీ గా ఉన్న సంగతి తెలిసిందే. తర్వాత హానర్ వేరే కంపెనీగా అవతరించింది.

గతంలో హువావే, హానర్ బ్రాండ్స్ నుంచి ఎన్నో స్మార్ట్ ఫోన్స్, వేరబుల్స్, లాప్ టాప్స్, ఇతర డివైజెస్ పెద్ద ఎత్తున లాంచ్ అవుతుండేవి. కానీ, గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో లాంచెస్ ఏమీ లేవు. దీంతో హానర్ భారత మార్కెట్ నుంచి వైదొలుగుతోందనే వార్తలకు బలం చేకూరినట్లైంది. ఏలా అయితేనేమీ, తాము తప్పుకోవడం లేదని హానర్ ప్రతినిధి క్లారిటీ ఇచ్చేశారు. మరి భారత్ లో త్వరలోనే ఏదైనా స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసి మేం రేసులోనే ఉన్నామని గట్టిగా ప్రకటిస్తారేమో చూడాలి.

2022 ప్రథమార్థం లో భారత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ స్తబ్దత నెలకొంది. ఇది కొన్ని రోజులుగా అలాగే కొనసాగుతోంది. భారత కన్స్యూమర్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్స్, యాక్సెసరీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు రెండు రెట్లు అధికంగా అమ్ముడవ్వక పేరుకుపోయి ఉన్నాయని మింట్ తన కథనంలో పేర్కొంది. వినియోగదారుల నుంచి డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని మింట్ విశ్లేషించింది. ఆర్థిక మాంద్యం, హై డాలర్ ప్రైసెస్ తో పంపిణీ ఖర్చు పెరగడంచే, కొనుగోలుదారులకు డిస్కౌంట్స్ లేకుండా పోయాయి. మరి భారత మార్కెట్ లో నెలకొన్న స్తబ్దతను మిగతా బ్రాండ్స్ ఎలా ఎదుర్కుంటాయో చూడాలి.

Previous articleOnePlus Ace Pro (OnePlus 10T) ఫస్ట్ లుక్
Next articleభారత్ లో మొదలైన Samsung Galaxy A04s ప్రొడక్షన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.